Home  »  TV News  »  Brahmamudi : హార్ట్ ఎటాక్ తో అత్త హాస్పిటల్ కి.. ఆ నిజం చెప్పేసిన మామ!

Updated : Jun 12, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -433 లో.... సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి జరుగుతుంది మన అబ్బాయి పెళ్లి.. ఇక్కడేం చేస్తున్నారని ఆడుగుతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్నానని సుభాష్ అనగానే.. అపర్ణ షాక్ అవుతుందిమ అయితే మీకు నాపై చాల కోపం ఉండాలే అని అపర్ణ అనగానే.. కోపం కాదు జాలిగా ఉందని సుభాష్ అంటాడు. అసలు నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని నా టెన్షన్ అని సుభాష్ అనుకుంటాడు. నాపై ఎందుకు అంత జాలి అని అపర్ణ అడుగగా.. అదేం లేదని సుభాష్ అంటాడు. అయితే నా పక్కన వచ్చి నిల్చోండి అని అపర్ణ అనగానే.. నేను రాలేనని సుభాష్ అంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. ఇద్దరు పక్కన ఉండి పెళ్లి జరిపించాలి కదా అని అంటుంది. సుభాష్ కి ఇష్టం లేకున్నా అపర్ణ బలవంతంగా తనని తీసుకొని వెళ్తుంది.

మరొకవైపు కావ్య హాస్పిటల్ లో మాయ గురించి టెన్షన్ పడుతుంటే.. అప్పుడే డాక్టర్ వచ్చి మాయ కోమా లోకి వెళ్ళిందని చెప్పగానే కావ్య షాక్ అవుతుంది. మరొకవైపు ముహూర్తం దగ్గర పడుతుంది కావ్య ఇంకా రావడం లేధని స్వప్న, కళ్యాణ్ , సుభాష్ ఇందిరాదేవి లు బయట వెయిట్ చేస్తుంటారు. అపుడే కావ్య వస్తుంది. అందరు కలిసి లోపలికి వస్తారు. ఏమైందని రాజ్ అడుగగా.. కావ్య రెండు చేతులు జోడించి ఏడుస్తుంది. అప్పుడే ముహూర్తం టైమ్ అయిందని రుద్రాణి అంటుంది. రాజ్ మాయ మెడలో తాళి కట్టబోతుంటే.. అప్పుడే అపర్ణ అంటు సుభాష్ అరుస్తాడు. ఈ పెళ్లి జరగదు.. జరగనివ్వను.. పీటల మీద నుండి లేవవే అని సుభాష్ మాయని అంటాడు. ఎందుకు పెళ్లి జరగనివ్వరని అపర్ణ అడుగుతుంది. అది అసలు మాయ కాదు.. నన్ను నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేసి ఈ ఇంటికి కొడలిగా అవుదామని వచ్చిందని.. అసలు నా కొడుకేం తప్పు చెయ్యలేదని సుభాష్ అనగానే.. అందరు ఆశ్చర్యపోతారు. రాజ్, కావ్య వచ్చి సుభాష్ తో నిజం చెప్పొద్దని చెప్తున్నా వినిపించుకోరు.  ఇన్ని రోజులు తల్లికోసం ఎన్ని కష్టలు అవమానాలు భరించారు నా కొడుకుకోడలు.. ఇప్పుడు నా కోడలికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండలేనని సుభాష్ అంటాడు.

అసలు రాజ్ తప్పు చెయ్యలేదంటే మరి ఆ బాబు ఎవరని అపర్ణ అడుగుతుంది. ఆ బాబుకి తండ్రి రాజ్ కాదు, నేను అని సుభాష్ అనగానే అందరు షాక్ అవుతారు. అపర్ణ మాత్రం అలాగే ఉండిపోతుంది. నేను నా మనసు అదుపులో లేనప్పుడు అలా జరిగింది ఆ బిడ్డని తీసుకొని మాయ వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంటే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను..  దానికి రాజ్ మాయతో మాట్లాడి ఆ బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చాడు. నన్ను క్షమించమని సుభాష్ అనగానే.. హార్ట్ ఎటాక్ తో అపర్ణ కిందపడిపోతుంది. వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అసలు ఆ మాయగా వచ్చింది ఎవరని ధాన్యలక్ష్మి అనగానే.. రుద్రాణి మాయని బెదిరించి ఇంట్లో నుండి పంపించిన విషయం గుర్తుకు చేసుకుంటుంది. తరువాయి భాగంలో మా అమ్మకి ఈ సిచువేషన్ రావడానికి కారణం నువ్వే అని కావ్యని రాజ్ తిడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.